ఛీ: ప్రజలను గాలికి వదిలేసి బెంగళూరు జైలు చుట్టూ తిరుగుతారా, స్టాలిన్

శశికళ మీద అంత ప్రేమ ఉంటే అందరూ రాజీనామాలు చేసి బెంగళూరు వెళ్లి అక్కడే ఉండాలని మంత్రులకు స్టాలిన్ సూచించారు. అంతే కాని తమిళనాడు ప్రజలు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడరాదని అన్నాడీఎంకే మంత్రులను

చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రజల గురించి పట్టించుకోకుండా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ నటరాజన్ గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, ఇలాంటి సిగ్గుమాలిన పని ఏలా చేస్తున్నారు అని ఆ రాష్ట్ర ప్రధాన పత్రిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు.

Stalin says that Tamil Nadu government and ministers not bothering about NEET Exam.

గురువారం డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంటే హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే అక్కడి ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.

నీట్ పరిక్షకు తమిళనాడును మినహాయించాలని విద్యార్థులు, అన్ని పార్టీల నాయకులు కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమిళనాడుకు రావాలసిన ప్రాజెక్టుల గురించి పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.

వేసవి సమీపిస్తుంటే తాగు నీటి సమస్య వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని స్టాలిన్ గుర్తు చేశారు. అయితే ఇక్కడి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను చూడటానికి క్యూ కడుతున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+