అక్కడ వాట్సప్లో ఫొటో పంపితే.. ట్రాఫిక్ క్లియర్ చేస్తారు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు అక్కడి పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
రాయ్పూర్లో ఎవరైనా ఒక వ్యక్తి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే ఆ ఫొటోను ట్రాఫిక్ పోలీసుల ఫోన్ నెంబర్కి వాట్సప్ ద్వారా పంపించాలి.

దీంతో వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలోని ట్రాఫిక్ అధికారులకు సమాచారం అందుతుంది. వారు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తారు.
ట్రాఫిక్ విషయంలో ప్రజలలు ఏవైనా సలహాలు, ఫిర్యాదులు ఉన్నా ఆ నెంబర్కి పంపించవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను ట్రాఫిక్ అధికారులు గోప్యంగా ఉంచుతారు.












Click it and Unblock the Notifications