వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9వ తరగతి బాలిక కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బరంపూర్: 9వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడని ఘటన ఒడిషాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఒడిషా గంజం జిల్లాలోని చాముండా గ్రామంలో ఫిబ్రవరి 18న 9వ తరగతి విద్యార్ధిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బాలికను నిర్మానుష్య ప్రాంతంలో దించి పరారయ్యారు.

Student Allegedly Gangraped in Ganjam

దీంతో బాలిక తనపై జరిగిన అత్యాచార విషయాన్ని ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

నిందితుల్లో ఒకరిని గుర్తించామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

English summary
A class IX student was allegedly gangraped by three persons in a moving car after they kidnapped her from Chhamunda village in Odisha's Ganjam district, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X