Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుబ్రమణ్యస్వామి కలకలం-నెహ్రూ,వాజ్ పేయ్ మూర్ఖత్వం-మత్తులో మోడీ-చైనా చేతికి టిబెట్, తైవాన్

నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇవాళ మరో కలకలం రేపారు. చైనాతో భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దానికి మరింత ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మాజీ ప్రధానుల కారణంగానే చైనా చేతుల్లోకి టిబెట్, తైవాన్ వెళ్లాయన్నారు.

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మరో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత సుబ్రమణ్యస్వామి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి తమ మూర్ఖత్వంతో టిబెట్, తైవాన్ చైనాలో భాగమని భారతీయులు అంగీకరించారని అన్నారని ఆరోపించారు. ఇప్పుడు చైనా పరస్పరం అంగీకరించిన వాస్తవాధీన రేఖను కూడా గౌరవించదని, లడఖ్‌లోని కొన్ని భాగాలను లాక్కుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై మరింత విరుచుకుపడిన సుబ్రమణ్య స్వామి, చైనా "లడఖ్‌లోని కొన్ని భాగాలను లాక్కుంది, అయితే మోడీ "కోయి అయా నహిన్" అంటూ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

Subramanian Swamy shocking: nehru, vajpayees foolishness concede tibet, taiwan to china

నెహ్రూ, వాజ్ పేయ్ మూర్ఖత్వం కారణంగా టిబెట్, తైవాన్ చైనాలో భాగమని భారతీయులం అంగీకరించామమని, కానీ ఇప్పుడు చైనా పరస్పరం అంగీకరించిన వాస్తవాధీన రేఖను కూడా గౌరవించడం లేదన్నారు. "కోయి అయా నహిన్" అని మోడీ మత్తులో ఉన్నప్పుడు లడఖ్‌లోని కొన్ని భాగాలను లాక్కుందన్నారు. మనకు ఎన్నికలు ఉన్నాయని చైనా తెలుసుకోవాలని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.

చైనా పదేపదే 'హెచ్చరికలు' చేసినప్పటికీ యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ను సందర్శించిన నేపథ్యంలో సుబ్రమణ్య స్వామి చేసిన ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+