సన్నీ లియోని: అందరూ కరోనా వ్యాక్సీన్ తీసుకోండి - ప్రెస్ రివ్యూ
కోవిడ్19 మహమ్మారిని ఓడించేందుకు వ్యాక్సీన్ తీసుకోవాలని నటి సన్నీ లియోని పిలుపు ఇచ్చారని 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' తెలిపింది.
"మీరు వ్యాక్సీన్ వేయించుకోండి, మీ ఆత్మీయులకు వ్యాక్సీన్ వేయించండి" అని ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె సూచించారు.
కరోనావైరస్పై ఫ్రంట్లైన్ వర్కర్స్ సాగిస్తున్న పోరాటం విజయవంతమయ్యేందుకు అందరం వ్యాక్సీన్ వేయించుకోవడం అవసరమని చెప్పారు.
cowin.gov.in వెబ్సైట్లో టీకా వేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
- కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది
- కరోనా: ముక్కులో నిమ్మరసం పిండితే ఆక్సిజన్ అందుతుందా.. కర్పూరం, వాము, నెబులైజర్ చిట్కాలు పనిచేస్తాయా - Fact Check
కరోనా నుంచి కోలుకున్న 99 ఏళ్ల మహిళ
హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో 99 ఏళ్ల మహిళ కరోనావైరస్ వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని ఈనాడు తెలిపింది.
ఆమె పేరు సీతారాత్నం. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు. ఆమె చాలా ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నారు.
ఏప్రిల్ 24న ఆమెకు దగ్గు, స్వల్పంగా జలుబు ఉండటంతో కరోనావైరస్ పరీక్ష చేయించారు. ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో ముందు జాగ్రత్తగా కుటుంబసభ్యులు ఆమెను మదీనాగూడలోని ప్రణమ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరు రోజుల వ్యవధిలోనే ఆమె వైరస్ నుంచి కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు.
కరోనా సోకిందని ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండటమే ముఖ్యమని సీతారత్నం చెప్పారు.
తెలంగాణ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ రోజు, రేపు టీకాలు వేయరు
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ శనివారం, ఆదివారం కోవిడ్ టీకాల పంపిణీని నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో చెప్పారని ఈనాడు రాసింది.
తెలంగాణకు టీకాల సరఫరా జరగలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.
మరోవైపు- తెలంగాణలో రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు కోవిడ్ టీకాల పంపిణీకి డ్రోన్లను ఉపయోగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతి ఇచ్చింది.
- కాన్పూర్ భైరవ్ ఘాట్ శ్మశానంలో తీసిన ఒక ఫోటో వైరల్ ఎందుకైంది... ఫోటోగ్రాఫర్ అరుణ్ శర్మ అనుభవం ఏంటి?
- ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటే ఏంటి... ఇది కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడగలదా?
ఏసీబీ కస్టడీకి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర
సంగం డెయిరీ కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తోపాటు మరో ఇద్దరు నిందితులను అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చిందని సాక్షి తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీడీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఎ. ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో నరేంద్రతోపాటు మరో ఇద్దరు నిందితులు పి.గోపాలకృష్ణన్, ఎం.గురునాథంలను ఏప్రిల్ 23న ఏసీబీ అరెస్టు చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో వీరిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. కేసులో లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని, నరేంద్ర సహా ముగ్గురు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరింది. తనకు బెయిల్ ఇవ్వాలని నరేంద్ర అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మే 1 నుంచి 5 వరకు ఈ ముగ్గురిని ఏసీబీ విచారించనుంది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: 'అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్కు 5 సార్లు నామినేట్ అయిన 'భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ''తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)