కర్ణాటకకు షాక్: తమిళనాడుకు కావేరీ వదలండి
న్యూఢిల్లీ: తమిళనాడుకు ప్రతి రోజు 2,000 వేల క్యూసెక్కుల కావేరీ నీరు విడుదల చెయ్యాలని కర్ణాటకకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము తదుపరి తీర్పు ఇచ్చే వరకు ఆదేశాలు పాటించాలని సుప్రీం కోర్టు చెప్పింది.
తమిళనాడు, కర్ణాటకలో కావేరీ జలాల కోసం అల్లర్లు జరకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. రెండు రాష్ట్రాల్లో అల్లరు జరకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి శాంతిని కాపాడాలని ఆదేశించింది.
రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని సుప్రీం కోర్టు సూచించింది. అక్టోబర్ 19వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. 2007లో కావేరీ వాటర్ ట్రిబునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంగళవారం సుప్రీం కోర్టులో త్రిసభ్య బెంచ్ పిటిషన్లు విచారించింది. మేము ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక కచ్చితంగా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు కర్ణాటకకు అనుకూలంగా ఉందని తమిళనాడు ప్రజలు ఆరోపించారు.