రామజన్మభూమి వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు 'సుప్రీం' రడీ
రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు అవసరమైతే తాము మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ:రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు అవసరమైతే తాము మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ఈ నెల 31వ, తేదికి వాయిదా వేసింది.
రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదం మతానికి సెంటిమెంట్ కు సంబంధించిన అంశమని కోర్టు అభిప్రాయపడింది. నమ్మకాలకు సంబందించిన విషయాల్లో కోర్టు బయటే పరిష్కరించుకోవడం శ్రేయస్కరమని కోర్టు అభిప్రాయపడింది.
ఈ విషయంలో తాము కేసును పరిష్కరించుకొనేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ చెప్పారు.
రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతూ బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు కోర్టు స్పందించింది.ఈ కేసుకు సంబందించిన విచారణను ఈ నెల 31వ, తేదికి వాయిదా వేసింది.