జయలలిత అనుమానాస్పద మృతి విచారణ: పిటిషన్ కొట్టి వేసిన సుప్రీం కోర్టు !
అమ్మ జయలలిత మృతిపై విచారణఉన్నత స్థామి కమిటి, సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణఅవసరం లేదని చెప్పిన సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎలా మరణించారు అనే విషయంపై విచారణ జరిపించడానికి ఉన్నత స్థాయి కమిషన్ ను నియమించాలని దాఖలు అయిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే విచారణ మొదలైయ్యిందని, మరో కమిటీ అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించడానికి తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగస్వామిని నియమించిన విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఇప్పటికే 15 మందికి నోటీసులు జారీ చేసి విచారణ మొదలు పెట్టారు.
అసెంబ్లీలో చర్చించకుండా తమిళనాడు ప్రభుత్వం జయలలిత మరణంపై ఏక సభ్య కమిషన్ ను నియమించిందని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేసిన సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే విచారణ మొదలైనందుకు మరో కమిటీ అవసరం లేదని చెప్పింది.