నేడు ప్రధాని చేతుల మీదుగా సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభం..
3400 కోట్ల రూపాయలతో నిర్మించిన, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనమైన 'సూరత్ డైమండ్ బోర్స్'ను నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ భవనం సుమారు 35.54 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ భవనం నిర్మాణంతో సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ భవనం సూరత్ నగరానికి సమీపంలోని ఖాజోద్ గ్రామంలో ఉంది.
నేడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు డైమండ్ బోర్స్ ఛైర్మన్, బోర్స్ కమిటీ సభ్యులతో సహా వజ్రాల పరిశ్రమ నిపుణులు కూడా హాజరుకాబోతున్నారు. సూరత్లోని ఖజోద్ ప్రాంతంలో నిర్మించిన 'సూరత్ డైమండ్ బోర్స్' రాష్ట్రం, దేశ ఆర్థిక అభివృద్ధికి ఓ మైలురాయిగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టును గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఫిబ్రవరి 2015లో శంకుస్థాపన చేశారు.

ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ నిర్మాణంలో తొమ్మిది టవర్లు, 15 అంతస్తుల గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ 300 చదరపు అడుగుల నుండి లక్ష చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఈ భవనంలో 67000 వ్యక్తులు, వ్యాపారవేత్తలు, సందర్శకులు కలిసే పనిచేసే వెసులుబాటు ఉంటుంది. సూరత్ డైమండ్ బోర్స్ కఠినమైన, మెరుగుపెట్టిన వజ్రాల వ్యాపారానికి ప్రధాన వ్యాపార కేంద్రమని చెప్పుకోవాలి. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. 4,500 కంటే ఎక్కువ ఇంటర్కనెక్టడ్ కార్యాలయాలు పెంటగాన్ కంటే పెద్దవిగా చెప్పబడ్డాయి.
4 వేలకు పైగా కెమెరాలు..
ఈ భవనంలోకి ప్రవేశించేముందు చాలా రకాల సెక్యూరీటీలు ఉన్నాయి. హై సెక్యూరిటీ చెక్పోస్టులు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఈ భవనంలో సభ్యుల కోసం గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంక్, రెస్టారెంట్, డైమండ్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 4000కు పైగా సీసీటీవీ ఫుటేజీ, అత్యాధునిక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన చాలా మంది వజ్రాల వ్యాపారులు ప్రారంభోత్సవానికి ముందే ఇక్కడ తమ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది.












Click it and Unblock the Notifications