"సుశాంత్ సింగ్ హత్యకు గురయ్యాడు" డాక్టర్లు చెబుతుండగా విన్నాను: ఆ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి అన్ని ఆధారాలను సేకరిస్తూ విచారణ చేస్తోంది. పలుమార్లు సుశాంత్ సింగ్ ప్రియురాలైన రియా చక్రవర్తిని విచారణ చేసింది. ఇప్పటికే పలు ప్రశ్నలు సంధించింది. అయితే తాజాగా ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష సాక్షిగా ఆ వ్యక్తిని పేర్కొన వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఓ జాతీయ మీడియాతో కూపర్ హాస్పిటల్లో ఏం జరిగిందనే విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పాడు.
Recommended Video
పోస్టుమార్టం గదిలో ఉన్న వ్యక్తి
సుశాంత్ సింగ్ ఆత్మహత్య వార్త ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ హాస్పిటల్కు పోలీసులు పంపారు. అయితే పోస్టు మార్టం తర్వాత సుశాంత్ సింగ్ భౌతికకాయాన్ని ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్లారు. అంతకుముందు మృతదేహాన్ని మోసుకెళ్లేందుకు పోస్టుమార్టం గదికి వెళ్లిన ఓ వ్యక్తి డాక్టర్లు మాట్లాడుకోవడం గమనించినట్లు జాతీయ మీడియాతో చెప్పాడు. లాక్డౌన్ సందర్భంగా పనులు లేకపోవడంతో డబ్బులు ఇస్తామంటే హాస్పిటల్కు వెళ్లినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. సుశాంత్ సింగ్ మృతదేహం పట్టేందుకు అక్కడకు వెళ్లినట్లు చెప్పాడు. ఇక పోస్టుమార్టం సమయంలో ఆ గదికి వెళ్లగా అది హత్యే అని డాక్టర్లు చెబుతుండటం తాను విన్నట్లు చెప్పాడు.
సుశాంత్ సింగ్ కాలు విరిగిపోయింది
ఇక సుశాంత్ సింగ్ భౌతికకాయం పట్టుకునేప్పుడు ఆయన గొంతు చుట్టూ సెల్లో టేప్ ఉన్న ఆనవాలు గమనించినట్లు చెప్పాడు. అంతేకాదు అతని శరీరంపై సూదులతో కుచ్చిన ఆనవాలు కనిపించాయని వెల్లడించాడు. పోస్టుమార్టం జరిగే సమయంలో తాను అక్కడే ఉన్నట్లు చెప్పిన వ్యక్తి ... సుశాంత్ సింగ్ కాలు ఒకటి ఫ్రాక్చర్ అయి ఉండటాన్ని గమనించినట్లు చెప్పాడు. ఇక సుశాంత్ సింగ్ను చూసేందుకు వచ్చిన రియా చక్రవర్తి మృతదేహాన్ని చూస్తూ ఐయాం సారీ అని చెప్పినట్లు తాను విన్నట్లు ఆ వ్యక్తి చెప్పారు. ఇక ఈ వ్యక్తి వివరించిన అంశాలతో కేసు మరో మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ సింగ్ది ఆత్మహత్య కాదు హత్య అని తన కుటుంబ సభ్యులు బంధువులు చెబుతున్న నేపథ్యంలో... తాజాగా ఈ వ్యక్తి జాతీయ మీడియాతో చెప్పిన వాస్తవాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వేగం పెంచిన సీబీఐకి మరో క్లూ దొరికిందా..
ఇదిలా ఉంటే ఇప్పటికే కేసులో వేగం పెంచిన సీబీఐ.. జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేసిన ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తన స్టేట్మెంట్ను రికార్డు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు కూపర్ హాస్పిటల్ వైద్యులు కూడా సెలవుపై వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని సీబీఐ ప్రశ్నలకు చెబుతున్న సమాధానం ఎక్కడా పొంతన లేకుండా ఉన్నట్లు సమాచారం. ఇక రియా చక్రవర్తి పై కూడా సీబీఐ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఆమె చెబుతున్న అంశాలను కూడా రికార్డు చేస్తోంది. ఇక తాజాగా ఈ వ్యక్తి చెప్పిన అంశాలతో కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.