దొంగ అనే అనుమానంతో కొట్టి చంపేశారు
గౌహతి: పశువుల దొంగ అనే అనుమానంతో ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపేసిన సంఘటన అసోంలో జరిగింది. డ్రైవర్ ను హత్య చేసిన కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
జుంటి ఆలీ అలియాస్ ఆలీ ( డ్రైవర్) అనే వ్యక్తి సోమవారం వేకువ జామున రెండు గంటల సమయంలో ఒక వాహనంలో ఆరు ఆవులను తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో గోలగడ్ జిల్లా సరిహద్దులోని జాతీయ రహదారి 37 దగ్గర స్థానిక గ్రామస్తులు వాహనాన్ని అడ్డుకున్నారు.
ఆవులు ఎక్కడివని ఆలీని ప్రశ్నించారు. తాను ఆవులను కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నానని ఆలీ చెప్పాడు. అయితే రసీదు చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆలీ రసీదు చూపించకపోవడంతో గ్రామస్తులు సహనం కొల్పోయారు.

ఆలీని కిందకు దించి ఇష్టం వచ్చినట్లు చికతబాదారు. ఆవులను కిందకు దించి వాహనానికి నిప్పంటించారు. తీవ్రగాయాలు కావడంతో ఆలీ అక్కడికక్కడే మరణించాడు. ఆలీకి సహకరించిన మిగిలిన పశువుల దొంగలను అరెస్టు చెయ్యాలని జాతీయ రహదారిలో ధర్నా నిర్వహించారు.
ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చించారు. ఆలీని హత్య చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications