అనుమానిత ఉగ్రవాదులకు విదేశాల్లో ఉగ్రవాదులతో లింక్, బెంగళూరు సీపీ !
బెంగళూరు/బెళగావి: బెంగళూరు నగరంలో ఇటీవల సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులకు విదేశాల్లో తలదాచుకున్న జునైద్ సహా పలువురు ఉగ్రవాదులతో సంబంధాలున్న సంగతి తెలిసిందే. వీరి పరిచయాల నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి. దయానంద్ తెలిపారు.
బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ దయానంద్ విలేకరులతో మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందడంతో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతర రాష్ట్రాల పోలీసులతో సీసీబీ పోలీసులు టచ్లో ఉన్నారు. అక్కడ జరిగిన ఘటనలపై సమాచారం అందడంతో సమగ్ర విచారణ జరుపుతున్నామన్నాని దయానంద్ అన్నారు.

అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లలో లభ్యమైన పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామని, త్వరలోనే నివేదిక అందజేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో ఎలాంటి వదంతులు వ్యాపించకూడదని, భద్రతా కారణాల దృష్ట్యా నిందితులు పేలుళ్లకు ప్లాన్ చేసిన ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లకు సిద్ధంగా ఉన్న పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే ఏ తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల వద్ద లభించిన గ్రెనేడ్లు ఒక విదేశీ కంపెనీ తయారు చేసిన గ్రెనేడ్లు అని సీసీబీ విచారణలో వెలుగు చూసిందని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ దయానంద్ వివరించారు.
బెంగళూరులోని కొడిగేహళ్లి మెయిన్ రోడ్డులోని భద్రప్ప లేఅవుట్లో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాది జాహిద్ తబ్రేజ్ ఇంటిపై సీసీబీ దాడులు నిర్వహించి నాలుగు లైవ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది. ఈ గ్రెనేడ్ల అసలు తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించేందుకు సీసీబీ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపారు.

గ్రెనేడ్లు స్థానికంగా తయారు చేయబడినవి కావని ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ గ్రెనేడ్లను విదేశాల్లోని కంపెనీలు తయారు చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మా విచారణలో కూడా అవి విదేశీ తయారీ గ్రెనేడ్లే అని తేలింది అని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు.
హెబ్బాళ్ సమీపంలోని సుల్తాన్ పాళ్యకు చెందిన అనుమానిత ఉగ్రవాది సయ్యద్ సుహైల్ ఖాన్ ఇంట్లో 7 నాటు బాంబులు, పిస్టల్స్, 45 లైవ్ బుల్లెట్లు, వాకీటాకీ సెట్లు, కత్తి, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో అనుమానిత ఉగ్రవాది జహీద్ ఇంట్లో దొరికిన గ్రెనేడ్లు కూడా విదేశీ తయారీ గ్రెనేడ్లే అని సీసీబీ పోలీసులు అంటున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications