గన్తో బెదిరించి సస్పెండైన పోలీసు మీద అత్యాచారం
గుర్గావ్: విధులు దుర్వినియోగం చేస్తూ సస్పెండ్ అయిన మహిళ కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగిందని గుర్గావ్ లోని డీఎల్ఎఫ్-2 పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో కానిస్టేబుల్ గా పని చేసే మహిళ (38) ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటూ పైఅధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో, సస్పెండ్ అయ్యారు. ఈమె గుర్గావ్ లోని రాజీవ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈమె పైన లంచం కేసు విచారణ జరుగుతోంది.
అయితే, సలీం (40) అనే వ్యక్తి తనను తుపాకితో బెదిరించి అత్యాచారం చేశాడని ఈమె ఆదివారం డీఎల్ఎఫ్-2 పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2012వ సంత్సరం ఒక గెస్ట్ హౌస్ లో సలీం తుపాకితో బెదిరించి తన మీద లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది.
సలీం తన మీద అత్యాచారం చేసే సమయంలో అతనికి నలుగురు సహకరించారని, రెండుసార్లు తన మీద అత్యాచారం చేసిన సలీం మీద కఠిన చర్యలు తీసుకోవాలని సస్పెండ్ అయిన మహిళ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.