‘హనీమూన్ల వల్లే కేదారనాథ్లో వరదలు’: స్వరూపానంద వివాదాస్పదం
లక్నో: ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో కేదార్నాథ్లో సంభవించిన వరదలకు హనీమూనర్లే బాధ్యత వహించాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్తరాఖండ్లోని పవిత్రమైన ప్రాంతాలను సందర్శించడానికి వస్తారని తెలిపారు.
అయితే వారిలో కొందరు హనీమూన్లకు, విహారయాత్రలకు వచ్చి అక్కడ అపవిత్రమైన పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులు చేయడం వల్లే కేదార్నాథ్లో అంత పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని తెలిపారు.

అంతేగాక, పవిత్ర ప్రాంతాల్లో ఇలాంటి అపవిత్రమైన పనులు ఆపకపోతే ఇలాంటి ప్రకృతి విపత్తులు మళ్లీ మళ్లీ సంభవిస్తాయని హెచ్చరించారు. 2013లో కేథారనాథ్లో సంభవించిన వరదల వల్ల దాదాపుగా 5000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
కాగా, రెండు రోజుల క్రితం కూడా ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. శనిసింగనాపూర్ గుడిలోకి మహిళలు ప్రవేశించడం వల్ల వారిని దురదృష్టం వెంటాడుతుందని, వారిపై అత్యాచారాలు ఇంకా పెరుగుతాయన్నారు.
అలాగే మహారాష్ట్రలో షిర్డీ సాయిని పూజించడం వల్లే అక్కడ కరవు సంభవించిందని చెప్పారు. దేవుడిని పూజించడం మాని ఓ ఫకీర్ని పూజిస్తే దాని ఫలితం ఇలాగే ఉంటుందని స్వరూపానంద సరస్వతి వార్తల్లో నిలిచారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications