ఐటీ మంత్రి తొలగింపు..!! సంచలన నిర్ణయం తీసుకున్న గవర్నర్..!!
చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించారు. అయితే సీఎం పళనిస్వామి మంత్రివర్గం సూచనల మేరకు ఐటీ మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పించామని రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం మాత్రం చర్చానీయాంశమైంది.
తమిళనాడు ఐటీ శాఖ మంత్రి ఎం మణికందన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. ఐటీశాఖ బాధ్యతలను రెవెన్యూశాఖ మంత్రి ఆర్ బీ ఉదయ్ కుమార్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళనిస్వామి సూచనమేరకు ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసినట్టు పేర్కొన్నారు. కానీ దీనిపై తమిళనాడు సీఎంవో ధ్రువీకరిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఐటీశాఖ మంత్రి మణికందన్ను పదవీ నుంచి తప్పించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వేలూరులో కోట్ల కట్టలు బయటపడటంతో ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది. దీంతో మణికందన్ ఆదేశాల మేరకే దాడులు జరిగాయా ? లేదంటే కేంద్రం సూచనలతో దాడులు చేశారా అనే అంశంపై స్పష్టత లేదు. మణికందన్ తొలగింపును ఇదీ కారణమా అనే చర్చ జరుగుతుంది. కానీ ఎందుకు బర్తరఫ్ చేశారనే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications