Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐటీ మంత్రి తొలగింపు..!! సంచలన నిర్ణయం తీసుకున్న గవర్నర్..!!

చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించారు. అయితే సీఎం పళనిస్వామి మంత్రివర్గం సూచనల మేరకు ఐటీ మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పించామని రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం మాత్రం చర్చానీయాంశమైంది.

తమిళనాడు ఐటీ శాఖ మంత్రి ఎం మణికందన్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. ఐటీశాఖ బాధ్యతలను రెవెన్యూశాఖ మంత్రి ఆర్ బీ ఉదయ్ కుమార్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళనిస్వామి సూచనమేరకు ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసినట్టు పేర్కొన్నారు. కానీ దీనిపై తమిళనాడు సీఎంవో ధ్రువీకరిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఐటీశాఖ మంత్రి మణికందన్‌ను పదవీ నుంచి తప్పించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

T N Governor made a sensational decision.. it minister remove cabinet

సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వేలూరులో కోట్ల కట్టలు బయటపడటంతో ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది. దీంతో మణికందన్ ఆదేశాల మేరకే దాడులు జరిగాయా ? లేదంటే కేంద్రం సూచనలతో దాడులు చేశారా అనే అంశంపై స్పష్టత లేదు. మణికందన్ తొలగింపును ఇదీ కారణమా అనే చర్చ జరుగుతుంది. కానీ ఎందుకు బర్తరఫ్ చేశారనే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+