వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కోసం శశికళ ప్రత్యేక పూజలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లి ముఖ్యమంత్రి కావాలని ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ ప్రత్యేక పూజలు చేశారు.

తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ అమ్మవారి ఆలయంలో బంగారు విమాన కుంభాభిషేక ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వం యుద్ధంలో గెలుపుకోసం ఆలయాల్లో మాంగల్య పూజలు నిర్వహించడం రాజులకు ఆనవాయితీ.

Tamil Nadu Chief Minister Jayalalithaa and Sasikala

తరువాత ముత్తయిదువులకు ప్రసాదాలు పంచడం వలన యుద్ధంలో కచ్చితంగా గెలుస్తామని రాజుల నమ్మకం. అదే అనవాయితీగా ఆలయ కుంభాభిషేకం కార్యక్రమంలో శశికల పాల్గోన్నారు. జయలలిత గెలుపు ఆశిస్తూ విశేష పూజలు నిర్వహించారు.

అదే సందర్బంలో 25 మంది మహిళా భక్తులకు రవిక వస్త్రం, తాళి బొట్టు తాడు (పసుపు తాడు), పసుపు, కుంకుమ తదితర 9 రకాల వస్తువులు ఉన్న బ్యాగ్ ను అందజేశారు. జయలలిత కచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని శశికళ ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Tamil Nadu Chief Minister Jayalalitha and Sasikala, Tamil Nadu Assembly elections 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X