Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోతున్న లెక్కలు-తాజా సర్వేలో తేల్చేసిన ఓటర్లు..!
తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Election 2026) జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి డీఎంకే, అన్నాడీఎంకే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఉత్తరాదిలో వరుసగా గెలుపులు సాధిస్తున్న బీజేపీకి తమిళనాడులో గెలుపు అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. దీంతో తమిళనాడు ఓటర్ల నాడి తెలుసుకునేందుకు పలు సర్వే (survey) సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా ఇన్ సైడ్ ఎలక్షన్ అనే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తమిళనాడులో మరోసారి హోరాహోరీ పోరు నెలకున్నా ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే ఉండబోతున్నట్లు తేలిపోయింది. అధికార డీఎంకేకు ఓటర్లు మరోసారి అధికారం కట్టబెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చిసింది. విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మరోసారి అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోతున్నట్లు నిర్ధారణ అయింది. అలాగే విజయ్ ప్రభావం కూడా లేదని తేలిపోయింది.

Projected vote share and seat share
— Inside Election (@InsideElection) April 6, 2026
▪️DMK+ 44% | 159 - 165
▪️NDA 33% | 64-70
▪️TVK 18% | 4 - 6
▪️NTK 3% | 0
▪️Others 2% | 0
Total Respondents: 1,63,800
▪️Constituencies (ACs): 234
▪️ Samples Per AC: 700
▪️ Survey Period: March 2026#TNElection2026 #TamilnaduElection https://t.co/6Sc1KeYG6q pic.twitter.com/vvGu3VViZq
234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో ఈసారి డీఎంకేకు 159-165 సీట్లు లభించబోతున్నట్లు ఇన్ సైడ్ ఎలక్షన్ సంస్థ తమ సర్వే ఫలితాల్లో తెలిపింది. అలాగే అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 64-70 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. విజయ్ పార్టీ టీవీకే కేవలం 4-6 సీట్లతో సరిపెట్టుకోక తప్పదని ఈ సర్వేలో పాల్గొన్న ఓటర్లు తేల్చేశారు. అలాగే డీఎంకే కూటమికి ఈసారి 44 శాతం మంది ఓటర్ల మద్దతు లభిస్తోందని, అన్నాడీఎంకే కూటమికి కేవలం 33 శాతం మంది ఓటర్లే మద్దతిస్తున్నట్లు తేలింది. విజయ్ పార్టీ టీవీకే కు 18 శాతం మంది ఓటర్లు అండగా నిలుస్తున్నారు. ఎన్టీకేకు 3 శాతం, ఇతరులకు 2 శాతం ఓటర్లు మద్దతిస్తున్నారు.

ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరికి ఓటేస్తారన్న ప్రశ్నకు ఎంకే స్టాలిన్ కు 44 శాతం మంది, పళనిస్వామికి 28 శాతం మంది, విజయ్ కు 24 శాతం మంది, సీమన్ కు 3 శాతం మంది, ఇతరులకు ఒక్క శాతం ఓటర్లు మద్దతిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు 30 శాతం ఓటర్లు చాలా బాగుందని, 20 శాతం బాగుందని, 25 శాతం యావరేజ్ అని, 15 శాతం మంది బాగోలేదని, 10 శాతం మంది అస్సలు బాగోలేదని తేల్చిచెప్పేశారు. డీఎంకే ప్రభుత్వం కొనసాగాలా అన్న ప్రశ్నకు 55 శాతం మంది అవునని, మార్పు కావాలని 25 శాతం మంది, ఏమీ చెప్పలేం అని మరో 20 శాతం మంది చెప్పారు.
-
ఏపీలో ఆ ఉద్యోగులకు 9, 23న పెయిడ్ హాలిడేలు..! రీజన్ ఇదే..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
తమిళనాడు, బెంగాల్ ఎంపీల్లేకుండా పార్లమెంటా ? చిదంబరం డౌట్స్..! -
తమిళనాడు ఎన్నికల్లో అనూహ్యం -
విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం -
తమిళనాట కొత్త లెక్కలు, సైలెంట్ సపోర్ట్ - సంచలనం ఖాయం..ప్రముఖ సర్వే రిపోర్ట్..!! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..














Click it and Unblock the Notifications