పన్నీర్, స్టాలిన్ లపై రైతులు ఫైర్: 14 రోజులు, ఢిల్లీలో ఎలుకలు తింటూ !
కావేరీ నీరు పంపిణి విషయంలో మాకు న్యాయం జరగాలంటే వెంటనే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు 14 రోజులకు చేరింది.
న్యూఢిల్లీ/చెన్నై: కావేరీ నీరు పంపిణి విషయంలో మాకు న్యాయం జరగాలంటే వెంటనే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు 14 రోజులకు చేరింది.
ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు సోమవారం ఢిల్లీ చేరుకుని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న తమిళనాడు రైతులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. కావేరీ నీరు పంపిణి విషయంలో తమిళనాడుకు అన్యాయం జరుగుతోందని ఆ రాష్ట్రానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు.

కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాలసిన కావేరీ జలాలు సక్రమంగా పంపిణి జరగాలంటే కచ్చితంగా కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గత 14 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర అర్దనగ్నంగా ధర్నాలు చేస్తున్న తమిళనాడు రైతులు సోమవారం ఎలుకలు తింటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, రైతులు తమిళనాడు రైతులకు మద్దతు ప్రకటించారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకే పరిమితం అయ్యారని. కనీసం ఢిల్లీకి వచ్చి మాకు మద్దతు ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం అలర్ట్ అయ్యారు. రైతుల డిమాండ్లను వెంటనే తీర్చాలని, తమిళనాడుకు రావాల్సిన నిధులు విడుదల చెయ్యాలని సోమవారం పన్నీర్ సెల్వం చెన్నైలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications