18 లక్షల అనుమానాస్పద ఖాతాలు,ఆ ఖాతాలపై ఐటి కన్ను

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన అక్రమ డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ కేంద్రీకరించింది.

న్యూఢిల్లీ:నల్లధనాన్ని అరికట్టేందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన పెద్దనగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో బారీ నగదు డిపాజిట్ చేసినట్టు తేలింది.

నల్లధనాన్ని అరికట్టేందుకు చేపట్టిన పెద్దనగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు తేలింది. సుమారు 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. ఈ మేరకు రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా చెప్పారు.

ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో ఈ వెరిఫికేషన్ ద్వారా ఈ ఖాతాల వివరాలను సేకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నవంబర్ 9వ, తేది నుండి డిసెంబర్ 31వ, తేదివరకు నమోదైన బారీ డిపాజిట్లపై కేంద్రం డేటా ఎనలిస్టుల సహయంతో అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్దమైంది.

 tax deparment identifies 18 lakh people whose deposits do not match tax profile

పెద్ద నగదు నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి ఐటి నోటీసులను పంపనున్నట్టు తెలిపారు. టాక్స్ పేమెంట్ ప్రోఫైల్ తో సరిపోవాలని డిపాజిట్ దారులకు ఈ మెయిల్ ఎస్ఎంఎస్ ల ద్వారా ప్రశ్నలను సేకరించనున్నారు.

ఈ ప్రశ్నలకు స్పందించకపోయినా, ప్రతిస్పందన అసంతృప్తికరంగా ఉన్నా, వెంటనే పోలీసులు నోటీసులు జారీ చేస్తారని ఆయన తెలిపారు.

మరో వైపు రెండు లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారి సంఖ్య దాదాపుగా కోటి వరకు ఉన్నట్టుగా సమాచారం. అలాగే కరెంట్ ఖాతాల్లో 12.5 లక్షలకుపైగా డిపాజిట్లను కూడ ఐటి పరిశీలిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+