Teacher: టవల్ ముక్కతో ఆన్ లైన్ పాఠాలు చెప్పిన టీచర్, ధరిద్రం చూడలేక ?, సీఎం సోదరి ఎంట్రీతో !
చెన్నై: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి పుణ్యమా అంటూ దేశవ్యాప్తంగా ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఎంతో ప్రసిద్ది చెందిన ఓ స్కూల్ లో కామంధుడైన టీచర్ ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఆన్ లైన్ పాఠాలు చెప్పడానికి ఆ ధరిద్రుడు టవల్ ముక్క కట్టుకుని వెళ్లి వీడియో లో అమ్మాయిలకు పాఠాలు చెప్పాడు. నీ స్లివ్ లెస్ టాప్ బాగుంది. నీ టీషర్టు బాగున్నాయి.... నీ డ్రెస్ లోపల.........అంటూ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి వివరిస్తూ నీఛంగా మాట్లాడాడు. సినిమాకు పోదామా అంటూ అమ్మాయికు వాట్సాప్ లు మెసేజ్ లు పంపించాడు. ఎంతో చరిత్ర కలిగిన ఆ స్కూల్ లో శ్రీమంతుల పిల్లలతో పాటు సినీ పరిశ్రము చెందిన వారి పిల్లలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పిల్లలు చాలా ఎక్కువ మంది చదువుతున్నారు. పాఠశాల యాజమన్యానికి ఫిర్యాదులు చేసినా ఆ కామాంధుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 20 ఏళ్లకు పైగా అక్కడే పని చేస్తున్న ఆ కామాంధుడైన టీచర్ ను అరెస్టు చెయ్యాలని సోషల్ మీడియాలో ఆందోళన మొదలైయ్యింది. సీఎం సోదరి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు అంటే పరిస్థితి ఎంత వరకు వెళ్లిందో అర్థం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ స్కూల్ గురించి చర్చ మొదైయ్యింది.

చెన్నైలో ఫేమస్ స్కూల్
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని కేకే నగర్ లో పద్మ శేషాద్రి బాల భవన్ పాఠశాల (PPBB)కి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన ఆ స్కూల్ లో శ్రీమంతుల పిల్లలతో పాటు సినీ పరిశ్రము చెందిన వారి పిల్లలు, సెలబ్రిటీల పిల్లలు అక్కడ చదువుతున్నారు. పీపీబీబీ స్కూల్ ట్రస్టులో ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త వైజీ. మహేంద్రన్ కూడా సభ్యుడిగా ఉన్నారు. సినీ నటుడు మహేంద్రన్ కుమార్తె మధుమతి అలియాస్ మధు ( బీజేపీ లీడర్) ప్రస్తుతం ఈ స్కూల్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారని వెలుగు చూసింది.

కామాంధుడి సెక్స్ పాఠాలు
పద్మశేషాద్రి బాల భవన్ లో రాజగోపాలన్ అనే ఉపాద్యాయుడు గత 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇదే స్కూల్ లో చదువుతున్న పూర్వపు విద్యార్థులు టీచర్ రాజగోపాల్ అరచకాలను సోలష్ మీడియాలో పోస్టు చేశారు. పాఠాలు చెప్పే ముసుగులో స్కూల్ లోని అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్న రాజగోపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి అతని మీద స్వతంత్ర దర్యాప్తు చేయించి అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ పూర్వపు విద్యార్థులు, ప్రస్తుతం ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు సోమవారం రోడ్ల మీదకు వచ్చి డిమాండ్ చేస్తూ పాఠశాల యాజమాన్యానికి లేఖ రాయడం కలకలం రేపింది.

టవల్ ముక్కతో ఆన్ లైన్ పాఠాలు చెప్పిన ధరిద్రుడు
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అంటూ ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. పద్మ శేషాద్రి బాల భవన్ లో చదువుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఇదే స్కూల్ టీచర్ రాజగోపాలన్ ఇంట్లో నుంచి ఆన్ క్లాసులు చెబుతున్నాడు. ఇటీవల బట్టలు మొత్తం విప్పేసిన రాజగోపాలన్ బెడ్ రూమ్ లో కేవలం టవల్ ముక్క మాత్రం కట్టుకుని వెళ్లి అమ్మాయిలకు ఆన్ లైన్ క్లాసులు చెప్పాడని వెలుగు చూసింది. టవల్ కిందకు కట్టుకుని అసభ్యంగా కెమెరా ముందు నిలబడి ఎక్కడ అంటే అక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకుని అమ్మాయిలకు దర్శనం ఇచ్చాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

నీఛంగా మాట్లాడిన టీచర్
అమ్మాయిలు స్లివ్ లెస్ డ్రెస్ లు వేసుకుని ఆన్ లైన్ క్లాసుకు హాజరైన విషయం గమనించిన రాజగోపాలన్ వారి అందచందాల గురించి వివరించాడని ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిలు మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు ఎలాంటి దుస్తులు అయినా సూపర్ గా ఉంటాయి, మీరు దుస్తులు లేకుంటే ఇంకా చాలా బాగుంటారు అని రాజగోపాలన్ ఆమ్మాయిల పట్ల చాలా అసభ్యంగా మాట్లాడాడని, ఆ వీడియోలు బాధితులు రికార్డు చేశారని వెలుగు చూశాయి.

ప్రైవేట్ పార్ట్స్ గురించి చర్చ ?, సినిమాకు వస్తావా
కొందరు అమ్మాయిల అవయవాలు, వారి ప్రైవేటు పార్ట్స్ గురించి మాట్లాడిన టీచర్ రాజగోపాల్ వారిని సినిమాలకు రావాలని వాట్సాప్ మెసేజ్ లు పంపించాడని, వారికి సెక్స్ పాఠాలు కూడా చెప్పాడని వెలుగు చూసింది. రానురాను టీచర్ రాజగోపాల్ అరచాకాలు ఎక్కువ కావడంతో బాధితులు ఇంతకు ముందే చాలా సార్లు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోలేదని ఆ స్కూల్ పూర్వపు విద్యార్థులు, ప్రస్తుతం అక్కడ చదువుతున్న విద్యార్థులు మండిపడుతున్నారు.

సీఎం సోదరి ఎంట్రీతో షాక్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోదరి, డీఎంకే పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కనిమోళి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. స్కూల్ లో చదువుకుంటున్న అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ రాజగోపాలన్ ను అరెస్టు చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సోదరి కనిమోళి పోలీసును డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video

జస్ట్ సస్పెండ్....... పోలీసులు ఎంట్రీ
సోమవారం టీచర్ రాజగోపాల్ వ్యవహారం ముదురిపోవడంతో పద్మ శేషాద్రి బాల భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మాయిల పట్ల టీచర్ రాజగోపాల్ తప్పు చేసినట్లు వెలుగు చూస్తే అతని అంతు చూస్తామని తమిళనాడు మంత్రి అన్బిల్ మహేష్ కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే టీచర్ రాజగోపాలన్ ను సస్పెండ్ చేశామని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. చెన్నై పోలీసులు, మహిళా శిసు సంక్షేమ శాఖ అధికారులు కూడా పీపీబీబీ స్కూల్ చేరుకుని విచారణ ముమ్మరం చేశారు. టవల్ ముక్క కట్టుకుని ఆన్ లైన్ పాఠాలు చెప్పిన కామాంధుడు రాజగోపాలన్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications