Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆన్సర్ షీట్ లో డబ్బులు: ‘పాస్’ చేయాలని బేరం.. టీచర్ రియాక్షన్!

తెలంగాణలో ఇటీవల ఇంటర్ పరీక్షలు పూర్తయిన క్రమంలో ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్ వైరల్ అయిన న్యూస్ మనందరికి గుర్తుంది.. అందులో అతను "నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. నన్ను పాస్ చేయండి సార్.. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు.. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్" వేడుకుంటూ రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది మరువక ముందే ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు టెన్త్ విద్యార్థి.

చదువు రాకపోయినా పర్వాలేదు.. చేతిలో పైసలు ఉంటే చాలు 'పాస్' అయిపోవచ్చు అనుకున్నాడో తెలివైన విద్యార్థి. పరీక్షా పత్రంలో జవాబులు రాయడం మానేసి, ఏకంగా ఇన్విజిలేటర్‌కే లంచం ఆఫర్ చేశాడు. జవాబు పత్రం (Answer Sheet) మధ్యలో వెయ్యి రూపాయల నగదు ఉంచి, తనను గట్టెక్కించాలని కోరాడు. ఝార్ఖండ్‌లోని పలమౌ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యా వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Teacher Rejects Bribe Student Gets Zero Marks After Attaching Cash to Exam Paper in Viral Jharkhand Incident

సంస్కృతం రాలేదు.. లంచం ఇచ్చాడు!

రాష్ట్రవ్యాప్తంగా బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక ఉపాధ్యాయుడు సంస్కృతం జవాబు పత్రాలను దిద్దుతుండగా, ఒక పేపర్లో రెండు రూ.500 నోట్లు దర్శనమిచ్చాయి. ప్రశ్నలకు సమాధానాలు రాయలేని ఆ విద్యార్థి, దిద్దే ఉపాధ్యాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ అడ్డదారి తొక్కాడు. నోట్లు పెడితే కనీసం పాస్ మార్కులైనా వేస్తారని ఆశించాడు. అయితే, ఆ ఉపాధ్యాయుడు ఏమాత్రం ప్రలోభాలకు లొంగకుండా, నిబంధనల ప్రకారం ఆ విద్యార్థికి 'సున్నా' (Zero) మార్కులు కేటాయించి తన నిజాయితీని చాటుకున్నారు.

Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి

షార్ట్‌కట్ పాలిట శాపం.. వైరల్ ఫోటోలు!

జవాబు పత్రంలో నోట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోకి చేరి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇదేం చదువు.. ఇదేం సంస్కారం?" అంటూ కొందరు మండిపడుతుండగా, విద్యార్థుల అనైతిక పోకడలపై విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టకుండా ఇలాంటి 'షార్ట్‌కట్' పద్ధతులు అవలంబించడం వల్ల విద్యార్థుల అకడమిక్ రికార్డులే కాకుండా, వారి భవిష్యత్తు కూడా అంధకారమవుతుందని హెచ్చరిస్తున్నారు.

వ్యవస్థను వెక్కిరిస్తున్న 'అడ్డదారులు'

పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తుండటం విచారకరం. కేవలం మార్కుల కోసం నైతిక విలువలను వదిలేస్తున్న విద్యార్థులకు, ఈ ఘటన ఒక గుణపాఠం కావాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మార్కులు కేవలం రాసిన సమాధానాలకే వస్తాయని, నగదు పెట్టినంత మాత్రాన ఫలితం ఉండదని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు.

దగ్గరుండి మరీ కాపీ కొట్టించి.. అడ్డంగా దొరికిన టీచర్లు!
దగ్గరుండి మరీ కాపీ కొట్టించి.. అడ్డంగా దొరికిన టీచర్లు!

తల్లిదండ్రుల బాధ్యత ఏది?

పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, నైతిక ప్రవర్తనను బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల సమయంలో షార్ట్‌కట్‌లను వెతకకుండా, క్రమం తప్పకుండా చదువుకోవడం, పునశ్చరణ చేయడంపై దృష్టి పెట్టేలా పిల్లలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఈ ఝార్ఖండ్ ఘటన ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉండాల్సిన పారదర్శకతపై సరికొత్త చర్చకు దారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+