గాజాపై కన్నీళ్లు.. హిందువుల చావుపై మౌనమా?: సినీ తారల ఆగ్రహం
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అమానుష హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ను గుంపుగా వచ్చి అత్యంత క్రూరంగా కొట్టి.. చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసిన ఘటనపై భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలు తీవ్రంగా స్పందించారు.
జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్ట్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ ఘటనపై ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. దీపు చంద్ర దాస్ హత్యను 'అమానవీయం', 'కసాయి చర్య'గా ఆమె అభివర్ణించారు. "బంగ్లాదేశ్లో జరుగుతున్నది బహిరంగ ఊచకోత. ఈ దారుణమైన మాబ్ లించింగ్ వీడియో చూసిన తర్వాత కూడా మీకు రక్తం మరగకపోతే, ఆ కపటత్వమే మనల్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఏ మూలనో ఏదో జరుగుతుందని కన్నీళ్లు పెట్టే మనం.. మన కళ్లముందే మన సోదరులను సజీవ దహనం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాం?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

సీనియర్ నటి జయప్రద ఆవేదన
మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రద ఈ ఘటనపై స్పందిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. "ఒక మనిషిని ఇంత దారుణంగా ఎలా చంపగలరు? ఇది కేవలం హింస మాత్రమే కాదు, సనాతన ధర్మం, హిందుత్వంపై జరుగుతున్న దాడి. మన సోదరీమణుల గౌరవంపై దాడులు జరుగుతున్నాయి, దేవాలయాలు కూల్చివేస్తున్నారు. మనం ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలి?" అని ఆమె ప్రశ్నించారు.
VIDEO | Former MP and actor Jaya Prada (@realjayaprada) says, "Today I am very unhappy, my heart is bleeding, thinking how such kind of brutality can be done to a person, in Bangladesh, an innocent Hindu person Dipu Charan Das was lynched by a mob, they not only killed him, but… pic.twitter.com/oBN3dNE1vx
— Press Trust of India (@PTI_News) December 25, 2025
'హిందువులారా మేల్కొనండి': కాజల్ అగర్వాల్ పిలుపు
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ క్రూరత్వాన్ని ఖండిస్తూ ఒక పోస్టర్ను షేర్ చేశారు. "హిందువులారా మేల్కొనండి.. మీ మౌనం మిమ్మల్ని కాపాడదు" అంటూ ఆమె హిందువుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
మనోజ్ జోషి ఘాటు వ్యాఖ్యలు
ప్రముఖ నటుడు మనోజ్ జోషి అంతర్జాతీయ సమాజం, సెలబ్రిటీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. "గాజా లేదా పాలస్తీనాలో చిన్న ఘటన జరిగినా అందరూ ముందుకొస్తారు. కానీ బంగ్లాదేశ్లో ఒక హిందువును దారుణంగా చంపితే ఎవరూ నోరు మెదపరు. ఈ మౌనం చాలా బాధాకరం" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏమిటీ ఘటన?
ఢాకాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని మయమన్సింగ్లో బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే దీపు చంద్ర దాస్ను ఒక గుంపు విచక్షణారహితంగా కొట్టింది. అనంతరం అతడిని వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఆ సమయంలో అక్కడున్న గుంపు కేకలు వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేయడం వీడియోలలో రికార్డ్ అయింది. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి అమృత్ మండల్ (29) అనే మరో హిందూ యువకుడిని కూడా గుంపుగా వచ్చి కొట్టి చంపినట్లు వార్తలు వస్తున్నాయి.
-
సాయి పల్లవి ఫ్యాన్స్కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications