తుపాకితో బెదిరించి యువతిపై రేప్: మరో ఘటనలో స్నేహితుడి భార్యపై..
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో దుండగులు ఓ యువతి, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొదటి ఘటనలో తుపాకీతో బెదిరించిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలి ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుంది.
యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని అరవింద్ అనే వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇన్హోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఫిబ్రవరి 24న ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. అరవింద్ మామకు ఈ విషయంపై ఫిర్యాదు చేసిన బాధితురాలిని అతడు తీవ్రంగా కొట్టాడని పోలీసులు తెలిపారు.
కాగా, ఎస్ఎస్పీ సుభాష్ సింగ్ను శుక్రవారం బాధితురాలి కుటుంబసభ్యులు కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుడితోపాటు అతని మామపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మరో ఘటనలో 30ఏళ్ల మహిళపై ఆమె భర్త స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన టిపినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. భర్త స్నేహితుడు కావడంతో ఇంటికి వచ్చిన నిందితుడికి ఆమె టీ ఇచ్చింది. తనకు తినేందుకు ఏమైనా కావాలని చెప్పడంతో ఆమె లోపలికి వెళ్లింది.
ఈ సమయంలో ఆమె తెచ్చుకున్న టీలో మత్తుపదార్థం కలిపాడు. ఆమె ఆ టీ తాగిన తర్వాత స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజేష్పై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల్లో బాధితురాలిపై రేప్ జరిగినట్లు తేలిందని చెప్పారు. శనివారం నిందితుడ్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.