వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను చేసిన కసరత్తు కూడా చేయలేదు: విభజనపై బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ప్రతిపక్ష నాయకుడిగా తాను చేసిన కసరత్తు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ముందుకు టేబుల్ ఐటమ్‌గా తీసుకురావడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎక్కడి నుంచో వచ్చిన సోనియా గాంధీ ఇక్కడి ప్రజలతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జాతీయ పార్టీలతో ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడిగితే పట్టించుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంప్రదాయాల విస్మరణపై రాష్ట్రపతి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాలవారితో మాట్లాడకుండా ముందుకెళ్తే ప్రజలు బుద్ధి చెప్తారని, కాంగ్రెసును భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై అప్పటికప్పుడు మంత్రి వర్గ సమావేశంలో నోట్ ఇస్తే ఎంత మంది మంత్రులు చదవగలరని ఆయన అడిగారు. ఇప్పుడే నోట్ ఇచ్చి చదవాలంటే ఎలా అని మంత్రులు అడిగినా పట్టించుకోలేదని, మంత్రులే కాపీలు చదవకుండా తీర్మానం చేయడం సమర్థనీయం కాదని ఆయన అన్నారు.

రాజ్యాంగంలోని నిబంధనలు అన్నింటికీ తిలోదకాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. ఎస్ఆర్సి, కమిషన్ల సిఫార్సులు, అసెంబ్లీ తీర్మానాల ద్వారా ఇంత కాలం విభజనలు జరిగాయని, సంప్రదాయాలను పక్కన పెట్టి తన స్వలాభం కోసం కాంగ్రెసు విభజన చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. కమిటీలు వేస్తూ పోయారే తప్ప వాటిని బయటపెట్టలేదని, ఎవరితోనూ చర్చించలేదని ఆయన అన్నారు. కొత్త రాజధాని కోసం మళ్లీ కమిటీనా అని ఆయన అన్నారు. కొత్త రాజధానికి మంచి ప్యాకేజీ అన్నారే గానీ ఏం చేస్తారో ఒక్క మాట కూడా చెప్పలేదని అన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్నారే గానీ ఏం చేస్తారో ఎలా పూర్తి చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం చేసినట్లుగా గతంలో ఎవరూ విభజన చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పెద్దలు విద్వేషాలు రెచ్చగొట్టి విధ్వంసాలకు కారకులవుతారని ఆయన అన్నారు. విభజన హేతుబద్దంగా, న్యాయం ప్రకారం చేయలేరా అని ప్రశ్నించారు. 18 వేల ఈమెయిల్స్ చదివి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu deplored the attitude of centre on the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X