అదేం భాష: చానళ్ల బ్యాన్పై కేసీఆర్కు ఘాటుగా ఖట్జూ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సమస్యలు తప్పవని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ హెచ్చరించారు.
గురువారం ఓ చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని సూచించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏబీఎన్ ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ప్రసారాలను నిషేధించారని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఒత్తిడితోనే ఎంఎస్వోలు ప్రసారాలు నిలిపివేశారని అభిప్రాయపడ్డారు. చానళ్ల ప్రసారాలు పుననరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్లోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.
మీడియా పైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖట్జూ తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో, మీడియా కూడా అభ్యంతరకరంగా ప్రసారాలు చేయడం సరికాదన్నారు. అయితే, సదరు టీవీ చానల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పిందన్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలన్నారు. కేసీఆర్ వాడిన భాష సరికాదని, అప్రజాస్వామికని, ముఖ్యంగా కేసీఆర్ అత్యున్నత స్థానంలో ఉన్నారని ఖట్జూ అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications