వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి గుడిసెలకు మంటలు: 10మంది సజీవ దహనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో రంబాన్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం రంబాన్ జిల్లాలోని చండర్‌కోటే ప్రాంతంలో తల్వాస్ వద్ద ఓ టన్నెస్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కూలీల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలు తగలబడ్డాయి. దీంతో ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు.

Ten people charred to death in Ramban in Jammu and Kashmir

అయితే అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో షార్ట్‌సర్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని జమ్మూ కాశ్మీర్ ఐజీపీ దనేష్ రాణా వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Ten people, most of them labourers working on a tunnel project, were charred to death in a fire incident in Ramban district of Jammu and Kashmir on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X