వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటల్ నుంచి అనుమానిత ఉగ్రవాదుల పరారీ!

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనుమానిత ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

భువనేశ్వర్‌లోని ఓ హోటల్‌లో ఉండేందుకు నలుగురు వ్యక్తులు వచ్చారు. గుర్తింపు కార్డులు అడగ్గా.. ఆ నలుగురు అక్కడ్నుంచి పారిపోయారు. కాగా, ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఆ నలుగురు ఉగ్రవాదులే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Terror Shadow In Odisha As Suspected Men Flee Bhubaneswar Hotel

ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారుతో అనుమానిత ఉగ్రవాదులు వచ్చారని, వారందరూ విదేశీయులేనని వారిని చూసిన కొందరు తెలిపారు. అయితే, ఆ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నకిలీదే అయి ఉంటుందని భావిస్తున్నారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని దేశ వ్యాప్తంగా పోలీసులు, భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. ఐఎస్ ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

English summary
Four suspected terrorists fled from a hotel in Odisha's Bhubaneswar today minutes before a police raid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X