సైకిల్ బాంబు పేలి 4గురి మృతి, కెఎల్ఓపై అనుమానం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సైకిల్ బాంబు పేలి నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. కామ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్కు (కెఎల్ఓ) చెందిన వారు ఈ బాంబు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ పేలుడు రాష్ట్రంలోని జల్పాయ్గురి జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందారని, మరికొంతమంది గాయపడ్డారని, బాంబును సైకిల్ పైన పెట్టారని ఉత్తర బెంగాల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శశికాంత్ పూజారి తెలిపారు.
ఈ ఘటన సాయంత్రం ఏడు గంటలకు జరిగింది. ఆరుగురు గాయపడ్డారని జిల్లా డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రభాత్ చక్రవర్తి చెప్పారు. గాయపడ్డ వారిని జల్పాయ్గురి జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు.
కెఎల్ఓ మిలిటంట్స్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తాము అనుమానిస్తున్నామని, ఇటీవలే ఆ సంస్థకు చెందిన పలువురిని అరెస్టు చేశామని, ఈ అరెస్టులకు ప్రతీకారంగా ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని శశికాంత్ పూజారి అన్నారు.












Click it and Unblock the Notifications