గుళ్లు పేలిస్తే పూవులు రావు, నేనొచ్చాక 40మంది హతం: టెర్రరిస్ట్లకు జమ్ము గవర్నర్ హెచ్చరిక
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి సత్యపాల్ సింగ్ ఉగ్రవాదులను హెచ్చరించారు. టెర్రరిస్టులు తుపాకీ గుళ్లకు బదులు పూలు ఆశించవద్దని ఎద్దేవా చేశారు. తుపాకీగుళ్లు పేలిస్తే వారికి ఆయువు కూరగాయలు నిలువ చేసే కాలమంత మాత్రమే ఉంటుందని హెచ్చరించారు.
తుపాకీ గుళ్లు పేలిస్తే తుపాకీ గుళ్లే తిరిగి వస్తాయని, ఇది చాలా తేలిక సమీకరణమని ఆయన అన్నారు. తుపాకీ గుళ్లకు బదులు పూల గుత్తులు మాత్రం రావని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల ఆయుష్షు చాలా తక్కువ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి సమాధి స్థితిలో లేదన్నారు.
నేను పదవిలోకి వచ్చిన తర్వాత 40 మంది ఉగ్రవాదులను హతమార్చారని గవర్నర్ చెప్పారు. కాశ్మీర్ లోయలో రాళ్లు విసరడం తగ్గిందని చెప్పారు. యువత ఉగ్రవాదుల్లో చేరడం తగ్గిందని అన్నారు. పరిస్థితులు మరీ అంత ప్రమాదకరంగా లేవని, ఇది సంతృప్తికరమైన విషయమని అన్నారు.

రాష్ట్రానికి చెందిన 13 నుంచి 20 ఏళ్ల వయస్సు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని గవర్నర్ చెప్పారు. ఇక్కడి యువత ఢిల్లీతో పాటు పాకిస్తాన్ పైన కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. హురియత్ లాంటి స్థానిక పార్టీలు ఆశాకిరణంలా కనిపించడం లేదని చెప్పారు. అందుకే యువతతో మమేకమై వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు.
కేంద్రం తమకు అనుకూలంగా లేదని వారు అప్పుడు అర్థం చేసుకుంటారని చెప్పారు. చదువుకున్న వారు కూడా చాలామంది చెడ్డపనులు చేస్తుంటారని, కొందరు ఈ దేశం గురించి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ నాలుగు వందల మంది ఉగ్రవాదులు ఉంటారేమో అన్నారు.
చంపాల్సింది ఉగ్రవాదులను కాదని, ఆ భావజాలాన్ని అన్నారు. ఉగ్రవాదం తుపాకీలో నుంచి రాదని చెప్పారు. మెదడులో నుంచి పుడుతుందని అన్నారు. ఇక్కడి యువతలో ఉగ్రవాద భావజాలం చెడిపేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని, ఉగ్రవాద సంస్థల నుంచి కేవలం వినాశనం, మరణం తప్ప ఏదీ లేదన్నారు. భారత్ను ముక్కలు చేసే విషయం మరిచిపోండి.. కనీసం ప్రపంచంలో ఒక చిన్న దేశాన్ని కూడా వారు ముక్కలు చేయలేరని హెచ్చరించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications