భార్యకు కోట్లలో ఆస్తి, భర్తకు అక్రమ సంబంధం, విదేశాల్లో మీడియేటర్ ఏం చేశాడంటే ?, మూడేళ్లకు !
విదేశాల్లో తలదాచుకుని అక్కడి నుంచి కిరాయి ఇచ్చి భార్యను పక్కాప్లాన్ తో హత్య చేయించిన భర్తతో పాటు ఆ హత్యకు సహకరించిన నిందితుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని బ్రహ్మావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్రగోడులోని మిలన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే విశాల గనిగ అనే మహిళ హత్య కేసు కర్ణాటకలో కలకలం రేపింది
2021 జూలైలో విశాల గనిగ అలియాస్ విశాల అనే మహిళ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు విశాల భర్త రామకృష్ణ, సుపారీ కిల్లర్లు స్వామినాథన్ నిషాద్, రోహిత్ రాణా ప్రతాప్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.సుపారీ కిల్లర్ స్వామినాథన్ నిషాద్ని విశాల భర్త రామకృష్ణకు పరిచయం చేసిన ధర్మేంద్ర కుమార్ సుహానీ మూడేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్నాడు.

2021 జూలై 12వ తేదీన బ్రహ్మావర్లోని కుమ్రగోడ్లోని మిలన్ రెసిడెన్సీలో విశాల గనిగను సుపారీ హంతకులు హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఆస్తి తగాదాల కోసం విశాల హత్యకు రూ.4 లక్షలు సుపారి ఇచ్చారని పోలీసులు చెప్పారు. హంతకులకు సుమారి ఇచ్చింది విశాల భర్త భర్త రామకృష్ణ అని వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని గోరకాపూర్కు చెందిన స్వామినాథ్ నిషాద్లను తరువాత అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్కు చెందిన రోహిత్ రాణా ప్రతాప్ నిషాద్ ముంబాయిలోని గ్రాంట్ రోడ్లో నివసించేవాడు. అయితే విశాల హత్య తర్వాత నిందితుడు ప్రతాప్ నిషాద్ ముంబాయి వెళ్లలేదు. మా కొడుకు ప్రతాప్ కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు ముంబాయిలోని గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వామినాథ్తో కలిసి విశాలను హత్య చేసిన ప్రతాప్ తరువాత నేపాల్ సరిహద్దులోని మహరాజ్గంజ్లో తలదాచుకున్నాడు. అక్కడ సాధువులతో కలిసి ఉంటే పోలీసులు పట్టుకోలేరని ప్రతాప్ ప్లాన్ చేశాడు.
కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి గోవా వెళ్లాడు. బ్రహ్మావర పోలీసులు గోవాకు వెళ్లగా అక్కడి నుంచి పారిపోయిన ప్రతాప్ తరువాత గోరకపూర్ చేరుకున్నాడు. అయితే 10వ తరగతి వరకు చదివిన ప్రతాప్ మొబైల్ ఫోన్ వాడలేదని, అందుకే అతన్ని మొబైల్ లొకేషన్ కదలికను పోలీసులు కనుక్కోలేకపోయారు. అయితే సొంత ఊరికి వెళ్లిన ప్రతాప్ చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. విశాలను హత్య చెయ్యడానికి ఆమె భర్తకు కిరాయి హంతకులను పరిచయం చేసిన ధర్మేంద్ర కుమార్ మూడు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఉడిపి జిల్లా పోలీసులకు చిక్కిపోయాడు. విశాల గనిగ భర్తకు అక్రమ సంబంధం ఉందని, ప్రియురాలి మోజులో పడి భార్య ఆస్తి కోసం ఆమెను హత్య చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications