Sister: రెసిడెన్షియల్ స్కూల్ లో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అన్నలు, మధ్యలో ఏం జరిగిందంటే ? !
బెంగళూరు/నంజనగూడు: రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు ఒకే రూమ్ లో ఉంటున్నారు. రూమ్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలకు ఇద్దరు అన్నలు ఉన్నారు. రెసిడెన్షిల్ స్కూలో చదువుతున్న అమ్మాయిలతో మాట్లాడటానికి వారి కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు తీసిచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇవే మొబైల్ ఫోన్ల కారణంగా ఓ యువకుడు హత్యకు గురైనాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. మొబైల్ ఫోన్లలో ఏముంది ? అని పోలీసులు పరిశీలించడంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

యువకుడి హత్య
యువతి నగ్న చిత్రాలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని యువతి సోదరుడు అతని స్నేహితుడితో కలిసి హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి నదిలో పడేశాడు. ఈ కేసును చేధించిన ఇద్దరు వ్యక్తులను కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని బిలిగెరె పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన వివరాలు తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు.

రెసిడెన్షియల్ స్కూల్
కర్ణాటకలోని హవేరి జిల్లా హిరేహళ్లి గ్రామానికి చెందిన చంద్ర గౌడ(25) అనే యువకుడి చెల్లెలు, మైసూరు జిల్లా టీ నరసీపూర తాలూకా ఎర్గనహుండి గ్రామంలో నివాసం ఉంటున్న లింగరాజు చెల్లెలు ఒకే రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్నారు. చంద్రేగౌడ అనే యువకుడు హత్యకు గురైనాడు. చంద్రగౌడ్ హత్య కేసులో లింగరాజు ను పోలీసులు అరెస్టు చేశారు.

ఫోన్లలో మాట్లాడాలని ?
లింరాజు సోదరి రెసిడెన్షియల్ స్కూల్లో క్లాస్మేట్స్ అయిన చంద్రేగౌడ సోదరి మొబైల్ నుంచి యువతి మొబైల్ నంబర్ తీసుకున్న చంద్రగౌడ ఆమెకు మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న లింగరాజు తన సోదరికి పెళ్లి చేస్తానని చంద్రేగౌడకు హామీ ఇచ్చి అతనితో స్నేహం చేశాడు.

చంపేసి శవాన్ని ఏం చేశారంటే ?
పెళ్లి విషయం మాట్లాడటానికి రావాలని చంద్రేగౌడను నంజన్గూడు తాలూకా తాయూరు గేట్ సమీపంలోకి పిలిపించారు. తరువాత చంద్రగౌడ్ కు మద్యం తాగతించిన అతన్ని దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని గోనె సంచిలో వేసి కావేరీ నదిలో పడేశాడు. చంద్రేగౌడ శవాన్ని స్వాధీనం చేసుసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

ఒకే రూమ్ లో ఫోటోలు తీసుకుంటే ?
కేసు విచారణలో చంద్రేగౌడ చెల్లెలి క్లాస్ మేట్ అన్నల లింగరాజు వ్యవహారం బయటకు వచ్చింది. లింగరాజ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. ఒకే రూమ్ ఒంటున్న అమ్మాయిలు అందరూ కలిసి ఫోటోలు తీసుకోవడం, ఆ ఫోటోలు ఓ అమ్మాయి అన్న చూడటం, తరువాత బ్లాక్ మెయిల్ వరకు వెళ్లడంతో ఓ యువకుడు హత్యకు గురైనాడని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications