Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆయెధ్య రామ మందిరం గుడి ఓపనింగ్ డేట్ ఫిక్స్, ప్రధాని మోదీ 20 ఏళ్ల చాలెంజ్ తో !

లక్నో/అయోధ్య: కోట్లాది మంది హిందూ భక్తుల కల అయిన అయోధ్య రామమందిరం నిర్మాణం పనులు చివరి దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. 2024 లో జనవరి 15వ తేదీ నుంచి 24వ తేదీలోపు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపినట్లు ఏబీపీ న్యూస్ తెలిపింది..

రామమందిరం ప్రారంభోత్సవ వేడుకల చివరి రోజైన జనవరి 24వ తేదీన దేవుడి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తుల కోసం రామమందిరం తలుపులు తెరుస్తారు. 2024 జనవరి 25వ తేదీ నుంచి సాధారణ భక్తులను ఆయోధ్యలోని రామమందిరం ఆలయ దర్శనానికి అనుమతిస్తామని మిశ్రా తెలిపారు.

The date has been fixed for the inauguration of the Ram Mandir in Ayodhya
ప్రారంభోత్సవ వేడుకలు కేవలం అయోధ్యకే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు వివిధ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడంతస్తుల ఆలయానికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చివరి దశలో ఉందని, దీపావళి నాటికి పూర్తి చేయనున్నారని తెలిపారు.

గర్భగుడి ప్రధాన ద్వారం బంగారంతో, దానిపై రామాయణం చరిత్ర గురించి తెలిపే వివారాల శిల్పాలు ఉన్నాయి. ఆలయం యొక్క 161 అడుగుల ఎత్తైన గోపురం కూడా బంగారం పూతతో కప్పబడి ఉంటుంది. ఆలయ ప్రాంగణమే కాకుండా శ్రీరామ జన్మభూమి యాత్ర ప్రాంతం అయిన 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయోధ్యలోని రామమందిరంలో రామ లల్లాను బలరాముని రూపంలో పూజిస్తారు.

The date has been fixed for the inauguration of the Ram Mandir in Ayodhya

ఆలయ శంకుస్థాపన సందర్భంగా మాత్రమే అయోధ్యను సందర్శించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. తన మాటను నిజం చేస్తూ 20 ఏళ్ల తర్వాత 2021 ఆగస్టు 5న అయోధ్యను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రామమందిరం ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గత వారం 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాముడి ఐదేళ్ల రూపంలో రామ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.

ఈ మైలురాయి ప్రపంచ స్థాయిలో అయోధ్య ప్రాముఖ్యతను పెంచుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది హృదయాల్లో అయోధ్యకు లోతైన అనుబంధం ఉందని గుర్తించిన ఆదిత్యనాథ్ ఆలయ నిర్మాణం తన అచంచలమైన భక్తికి, విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. మొత్తం మీద అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ చెయ్యడంతో కోట్లాది మంది రాముడి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+