మగవారి కంటే ఆడవాళ్ల చర్మం చల్లగా ఎందుకుంటుందో తెలుసా?
న్యూఢిల్లీ : ఎప్పుడైనా గమనించారా..? మగవాళ్లతో పోల్చితే మహిళల చర్మం ఎందుకు చల్లగా ఉంటుంది. దీనికి కారణమేంటంటే.. చర్మం కింద నిర్మితమై ఉండే రక్తనాళాల అమరిక స్త్రీ పురుషుల్లో వేరుగా ఉండడమే. ఆడవాళ్లలో రక్తనాళాల అమరిక చర్మం ఉపరితలానికి దూరంగా ఉంటుంది. మగవాళ్లలో చర్మ ఉపరితలానికి దగ్గరగా రక్తనాళాల అమరిక ఉంటుంది.
ఈ కారణం వల్లే స్త్రీల్లో చర్మ స్పర్శ చల్లగా ఉంటే.. మగవాళ్లలో వెచ్చగా ఉంటుంది. దీనికి మరో కారణమేంటంటే.. మగవాళ్ల జీవక్రియల్లో సాధారణంగానే వేడిని ఉత్పత్తి చేసే ప్రక్రియ వేగంగా ఉంటుంది. స్త్రీల్లో మాత్రం కాస్త మెల్లిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లకు జీవక్రియ 25 నుంచి 32 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఇక కండరాల మధ్య తేడా కూడా స్త్రీ పురుషుల్లో ఈ వైరుద్యానికి కారణం. మహిళలతో పోల్చితే మగవారి చర్మం కాస్త ముదురుగా మందంగా ఉంటుంది. కండరాల బరువు కూడా మహిళల కంటే మగవారిలో ఎక్కువ. ఇక థైరాయిడ్ గ్రంథి ఎక్కువ క్రియాశీలకంగా పనిచేయడం వల్ల కూడా ఆడవాళ్లలో రక్తం వేడి ఎప్పటికప్పుడు నియంత్రించబడుతుంది. దీనివల్లే మహిళల్లో తరుచూ థైరాయిడ్ సమస్యలు తలెత్తుంటాయి.
వీటి మొత్తం పర్యవసానంగానే స్త్రీ పురుషుల్లో చర్మ స్పర్శకు సంబంధించిన ఈ తేడా కనిపిస్తుంటుంది. మహిళల గర్బాశయం వెచ్చగా ఉండేందుకు.. మగవాళ్ల జననాంగాలు చల్లగా ఉండేందుకు.. సహజంగానే మానవ శరీరానికి సంక్రమించిన శారీరక ధర్మాలుగా వీటిని చెప్పుకుంటారు.












Click it and Unblock the Notifications