జూన్ 17నుండి జూలై 26 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...
17 వ లోక్సభలో మొదటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూన్ 17 నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ పదిహేడు నుండీ జూలై 26 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా జూలై అయిదున కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మొదటి బడ్జెట్ ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు లోక్సభ స్పీకర్ ఎన్నికను జూలై పందోమ్మిదిన ఎన్నుకోనున్నట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి
ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

కాగా జూన్ 17న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల చేత ప్రోటేం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 17, 18 తేదీల్లో కొనసాగనుంది. అనంతరం 19 తేదీన స్సీకర్ ఎన్నిక కొనసాగనుంది.
స్పికర్ ఎన్నిక అనంతరం జూన్ 20 తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం ఉండనుంది, రాష్ట్ర్రపతి ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం రాష్ట్ర్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే కార్యక్రమం మరో రెండు రోజుల పాటు ఉంటుంది.
కాగా ఎన్నికలకు ముందు పిభ్రవరి,మార్చి నెలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్థుతం పూర్తి స్ధాయి బడ్జెట్ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు.












Click it and Unblock the Notifications