5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్గా అనందిబేన్ పటేల్...
కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు మరో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. ఈ నేపథ్యంలోనే యూపి,మధ్యప్రదేశ్ గవర్నర్లకు స్థాన చలనం కల్పించిన కేంద్రం నాగాలాండ్తో వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో భాగంగానే ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇటివల పలువురు గవర్నర్లను నియమించింది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్గా బిశ్వభూషన్ హరిచంద్ను నియమించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కీలకమైన రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చింది.ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉన్న అనందిబెన్ పటేల్ను ఉత్తరప్రదేశ్కు బదీలి చేసింది. దీంతో పాటు బీహార్కు గవర్నర్ లాల్జీ టాండన్ను మధ్యప్రదేశ్కు గవర్నర్గా నియమించింది.

ఇక పశ్చిమబెంగాల్ గవర్నర్గా ప్రముఖ న్యాయవాది ,జగదీప్ ధన్ఖర్ ,త్రిపుర గవర్నర్గా రమేశ్ బయాస్ ,నాగాలాండ్ గవర్నర్గా ఆర్ఎన్ రవిలు నియమింపబడ్డారు.
5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్గా అనందిబేన్ పటేల్...












Click it and Unblock the Notifications