శవాలను తీసుకెళ్లండి పాకిస్థాన్కు అవకాశం ఇచ్చిన భారత్...!
జమ్ము కశ్మీర్లోని కుప్వార జిల్లా సరిహద్దు వెంట కాల్పుల్లో మృతి చెందిన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు భారత దేశం, పాకిస్థాన్కు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నుండి వచ్చేవారు తెల్లజెండాలతో వచ్చి మృతుల అంతిమ సంస్కరాలు నిర్వహించుకోవాలని సూచించింది. అయితే భారత భద్రతా అధికారలు సూచనపై పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు.
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కీరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన బ్యాట్ సభ్యులను భారత సైనికులు హతమార్చారు. బ్యాట్ దాడి యత్నం జులై 31న అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. కాగా మృతులు పాక్ సైన్యానికి చెందిన కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ అయి ఉండోచ్చని భావిస్తున్నారు.

కశ్మీర్ లోయలో శాంతికి భగ్నం కలిగించడానికి, అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాక్ గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేసిందని రక్షణశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.భారత సైనిక పోస్టులపై దాడికి యత్నించిన పాక్ బ్యాట్ బృందం కుయుక్తులను మన దేశ సైనికులు సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే.
-
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!











Click it and Unblock the Notifications