బెంగళూరులో హైఅలర్ట్: బంద్ లేదు, పుకార్లు నమ్మద్దు
బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో మళ్లీ అల్లర్లు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలో ఈనెల 25వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
సోమవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలో కావేరీ మానటరింగ్ కమిటి సమావేశం ప్రారంభం అయ్యింది. కేంద్ర జనవనురుల శాఖ ప్రధాన కార్యదర్శి శశిశేఖర్ నేతృత్వంలో సమావేశం ప్రారంభం అయ్యింది. కర్ణాటక, తమిళనాడు,. కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరైనారు.
కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాధవ్ ఈ సమావేశానికి హాజరైనారు. కావేరీ జలాలతో పాటు కర్ణాటకలో నీటి సమస్యగురించి ఇదే సందర్బంలో చర్చకురానుంది. సోమవారం జరిగే సమావేశంలో కర్ణాటకకు న్యాయం జరుగుతుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కావేరీ జలాల పంపిణి విషయంలో సోమ, మంగళవారం ఏ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వస్తుందో అని తెలియకపోవడంతో బెంగళూరు నగర పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బెంగళూరులోని సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సోమ, మంగళవారం బెంగళూరులో బంద్ ఉండదని, పుకార్లు నమ్మరాదని పోలీసు అధికారులు సోషల్ మీడియాలో మనవి చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు అధికారులు హెచ్చరించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications