జయ మృతిపై సీబీఐ విచారణ: శశికళ పుష్ప పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం
జయ మృతిపై అన్నాడీఎంకె బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది.
న్యూఢిల్లీ: తమిళ దివంగత సీఎం జయ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం మెట్లెక్కిన అన్నాడీఎంకె బహిష్కృత ఎంపీ శశికళ పుష్పకు చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం గురువారం నాడు కొట్టివేసింది.
కాగా, తన పిటిషన్ లో జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజుల్లో జయలలితకు అందించిన చికిత్స వివరాలు మిస్టరీగా మిగిలిపోయాయని, దీని వెనకాల ఏదో కుట్ర జరిగి ఉంటుందన్న అనుమానం అటు జనంలోను నెలకొందని శశికళ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇదివరకే అపెక్స్ కోర్టు శశికళ పిటిషన్ ను కొట్టివేయగా.. గతవారం మద్రాస్ కోర్టులో శశికళ నటరాజన్ పై దాఖలు చేసిన పిటిషన్ సైతం కొట్టివేయబడింది. అన్నాడీఎంకె అధినేత్రిగా శశికళ నటరాజన్ ఎన్నిక చెల్లదని, దీనిపై స్టే విధించాలని శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ ను సైతం కోర్టు కొట్టివేసింది.
ఇదే అంశంపై అన్నాడీఎంకె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన కారణంగా.. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత ఆమెకు లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వాదనను సమర్థిస్తూ శశికళ పుష్ప పిటిషన్ ను మద్రాస్ కోర్టు కొట్టివేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications