నిన్న ప్రజ్వల్, నేడు సోదరుడు, స్వలింగ సంపర్కుల కేసు, అంత పెద్ద ఫ్యామిలీలో?
కర్ణాటకలోని హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు కావడం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణపై స్వలింగ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి హెచ్డీ. రేవణ్ణ పెద్ద కుమారుడు సొంత పార్టీకి చెందిన ఓ యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణ వినిపిస్తోంది.ఈ చర్య జూన్ 16వ తేదీన జరిగినట్లు సమాచారం.
చిన్న కొడుకు ప్రజ్చల్పై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో మరో కొడుకుపై స్వలింగ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా అరకలగూడకు చెందిన జేడీఎస్ కార్యకర్త ఒకరు ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ తనపై స్వలింగ సంపర్కుడిలా లైంగిక దాడి చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ మీద స్వలింగ సంపర్కుడు అని ఆరోపణలు రావడం, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువకుడు ఆరోపించడం కలకలం రేపింది.

డాక్టర్ సూరజ్ రేవణ్ణ తన మీద లైంగిక దాడి చెయ్యడమే కాకుండా తనను దుర్భాషలాడాడని బాధితుడు కర్ణాటక డీజీపీ, ఐజీలకు ఫిర్యాదు చేశాడు. బలవంతంగా తన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేశాడు.
జూన్ 16వ తేదీ రాత్రి చెన్నరాయపట్నం తాలూకాలోని గన్నికాడ ఫామ్హౌస్లో సూరజ్ రేవణ్ణ తన మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వింత ఆరోపణలతో రేవణ్ణ కుటుంబం మళ్లీ కంగుతిన్నది. ఫామ్హౌస్కు తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువకుడు ఆరోపించాడు. ఆ యువకుడు కర్ణాటక సీఎం, హోంమంత్రి, డీజీ, ఐజీపీ, హాసన్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం హాసన్ జిల్లాలో జోరుగా చర్చనీయాంశమైంది. ఈ విషయమై బాధితుడు బెంగళూరు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
బాధిత యువకుడిపై ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరజ్ సహాయకుడు శివకుమార్ హలేనరసిపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తప్పుడు ఆరోపణలు చేసి ఎమ్మెల్సీ సూరజ్ ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని, రూ. 5 కోట్లు ఇవ్వాలని సూరజ్ రేవణ్ణను బెదిరించారని ఆయన పీఏ కేసు పెట్టారు.
రూ. 5 కోట్లు డబ్బులు చెల్లించకుంటే స్వలింగ లైంగిక వేధింపుల కేసు నమోదు చేస్తామని నిందితుడు బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అరకలగూడకు చెందిన ఓ యువకుడు తన యజమాని వద్ద ఉద్యోగం ఇప్పించాలని సూరజ్ పీఏ శివకుమార్కు ఫోన్ చేశాడు. దీంతో జూన్ 16వ తేదీన సూరజ రేవణ్ణ ఉద్యోగం కోసం గన్నికాడ ఫాంహౌస్కు వెళ్లాడు. పని అడిగేసరికి తిరిగి వచ్చిన సూరజ్ను బ్లాక్మెయిల్ చేశాడని కేసు నమోదు అయ్యింది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications