తెల్ల పులి పిల్లలు: పేర్లు పెట్టిన జయలలిత (ఫోటోలు)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నాలుగు తెల్ల పులి పిల్లలకు నామకరణం చేశారు. చూడముచ్చటగా ఉన్న నాలుగు తెల్ల పులి పిల్లలకు చక్కటి పేర్లు పెట్టి వార్తల్లో నిలిచారు. మంత్రులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
చెన్నైలోని వండలూరు లోని ప్రసిద్ది చెందిన అరిగ్నార్ అన్నా జూపార్క్ లో నమృత అనే తెల్లపులి ఉంది. ఈ తెల్ల పులి ఇటీవల నాలుగు తెల్ల పులి పిల్లలకు జన్మనిచ్చింది. జూపార్క్ అధికారులు ముఖ్యమంత్రి జయలలిత దగ్గర పులి పిల్లలకు నామకరం చేయించాలని నిర్ణయించారు.

విషయం అమ్మకు చెప్పారు. అరుదుగా ఉండే తెల్ల పులి పిల్లలకు నామకరణం చెయ్యడానికి జయలలిత ఆసక్తి చూపించారు. ఆదివారం ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు, అధికారులు అరిగ్నార్ అన్నా జూపార్క్ చేరుకున్నారు.

నాలుగు తెల్లపులి పిల్లల్లో రెండు మగ, రెండు ఆడ ఉన్నాయి. ఆడ పులిపిల్లలకు మాలా, కాలా అని పేర్లు పెట్టారు. రెండు మగ పులి పిల్లలకు దేవా, నకులా అని పేర్లు పెట్టారు. జూపార్క్ లో పులి పిల్లలను చూస్తూ అమ్మ ఉల్లాసంగా గడిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications