Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health: మీరు ఆ కంపెనీ మసాలాలు వాడుతున్నారా.. అయితే క్యాన్సరే..!

హాంకాంగ్‌ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ సెంటర్ ఫుడ్ సేఫ్టీ మరో బాంబు పేల్చింది. మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలపై సంచలన విషయాలు బయట పెట్టింది. కొద్ది రోజుల క్రితం నెస్లే బేబీ ఫుడ్ ప్రొడక్ట్ లో షుగర్ ఎక్కువగా ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా దేశంలో ప్రసిద్ధి చెందిన మసాలా ఉత్పత్తుల తయారి సంస్థలపై హాంకాంగ్‌ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ సెంటర్ ఫుడ్ సెఫ్టీ షాకింగ్ వివరాలను బయటపెట్టింది.

ఎవరెస్ట్, ఎండీహెచ్ నాలుగు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫుడ్ సేఫ్టీ తెలిపింది. ఎండీహెచ్, ఎవరెస్ట్ కంపెనీలకు చెందిన నాలుగు రకాల ఉత్పత్తుల నమూనాలకు సెంటర్ ఫుడ్ సెఫ్టీ సాధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఈ నాలుగు ఉత్పత్తుల్లో ఇథలీన్ ఆక్సైడ్ ఉందని తేలినట్లు చెప్పింది. దీన్ని పురుగుమందుల్లో వాడే రసాయనంగా పేర్కొంది. నాలుగు మసాలాల్లో ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలా ఉంది.

There are carcinogens in the spices of many Indian companies

మిగిలిన మూడు మసాలాలు ఎండీహెచ్ కంపెనీకి చెందినగా పేర్కొంది. ఈ మూడు మసాలాల్లో మద్రాస్‌ కర్రీ పౌడర్‌ (స్పైస్‌ బ్లెండ్‌ ఫర్‌ మద్రాస్‌ కర్రీ), మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌, సాంబార్‌ మసాలా ఉన్నట్లు వెల్లడించింది. ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ సంస్థ గ్రూప్‌ 1 క్యాన్సర్‌ కారకంగా ఇథిలీన్‌ ఆక్సైడ్‌ను గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈ నాలుగు ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని స్పష్టం చేసింది.

ఇథలీన్ ఆక్సైడ్ వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ తెలిపింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలను సింగపూర్‌ తన మార్కెట్ల వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+