ఆ విమానాలు మాకు రెంట్ కు ఇవ్వండి..! జెట్ ఎయిర్ వేస్ కు ఎయిర్ ఇండియా ప్రతిపాదన..!!
ముంబయి/హైదరాబాద్ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి లాకౌట్ దిశగా అడుగులు వేసిన జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. జెట్ విమాన సేవలు నిలిపివేసినందుకు ఆ సంస్థ విమానాలను తమకు లీజుకు ఇవ్వాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్విని లోహాని ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్కు లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభంతో అన్ని విమానసేవాలను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ఎయిర్వేస్ దగ్గర ఇప్పుడు 16 అతి భారీ విమానాలు ఉన్నాయి. వాటిలో బోయింగ్కు 777-300ఈఆర్ విమానాలు 10 ఉంటే మిగిలిన ఆరు ఎయిర్బస్కు చెందిన ఏ330ఎస్ విమానాలున్నాయి.
జెట్ విమానాల్లో ప్రస్తుతం 5 బోయింగ్ విమానాలను తమకు లీజుకు ఇస్తే కీలకమైన అంతర్జాతీయ రూట్లలో నడుపుతామని లేఖలో కోరారు. ఈ విషయమై రజనీష్ను శుక్రవారం లోహాని నేరుగా కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం లండన్, పారిస్, న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలకు విమాన సర్వీసులు నడుపుతున్న దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.

జెట్ విమానాల లీజుకు ఒప్పందం కుదిరితే మరిన్ని నగరాలకు సేవలు విస్తరిస్తామని, ఇప్పటికే సేవలు అందిస్తున్న నగరాలకు విమానాల ఫ్రీక్వెన్సీని పెంచుతామని అన్నారు. ఎయిర్ ఇండియా ప్రతిపాదనకు జెట్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications