మధురై ఆలయ చెరువులో వేలకొద్ది చేపలు మృత్యువాత
మధురై : మధురైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న శరవణపోయ్ గాయ్ చెరువులో ఆదివారం నాడు వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆలయ పరిసరాల్లోకి విపరీతమైన దుర్గంధం వ్యాప్తి చెందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పలువురు సిబ్బంధిని రంగంలోకి దించి మృత్యువాత పడ్డ చేపలను తరలించే ప్రయత్నం చేశారు.
ఎవరో దుండగులు ఉద్దేశపూర్వకంగానే చెరువు నీటిలో విష పదార్థాలు కలిపి ఉండవచ్చునని, అందుకే చేపలు చనిపోయాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి చెరువులోని చేపలన్నిమృత్యువాత పడి చెరువు మీద తేలుతూ కనిపించాయి. మధురైలోని తిరుప్పరన్ కుంద్రం ప్రాంతంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది.

కాగా, శరవణ చెరువును ప్రతీ ఏటా కొంతమంది చేపల వ్యాపారులకు లీజుకు ఇస్తు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి గాను రూ.47 వేలకు ఆ చెరువు లీజు హక్కులు అమ్మినట్లు సమాచారం. చేపల మృత్యువాతతో లీజుకు తీసుకున్న వ్యక్తికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది.
ఇదంతా పక్కనబెడితే.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకునే భక్తులంతా శరవణ చెరువులో స్నానమిస్తుంటారు. శరవణ చెరువు నీళ్లను భక్తులంతా పవిత్ర జలంగా భావిస్తుంటారు. అలాంటి చెరువులో విష పదార్థాలు కలిపారన్న వార్త ఇప్పుడు భక్తుల్లోను కలకలం రేపుతోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications