భారత్ లో చోరబడిన పాక్ బాలురు (వీడియో)
జైపూర్: భారత్ లో చోరబడిన పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు బాలురులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులోని జోద్ పూర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు అన్నారు.
బీఎస్ఎఫ్ జనరల్ బీఆర్ మెఘవాల్ మాట్లాడుతూ రాజస్థాన్ లోని జైస్లమీర్ జిల్లాలోని కురాలీబేరి గ్రామం శివార్లలో ముగ్గురు పాకిస్థాన్ కు చెందిన బాలురులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ముగ్గురు అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయం గ్రామస్తులు గుర్తించారు.
తరువాత బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురికి 12 నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇంటిలిజెన్స్ వర్గాలు ముగ్గురిని విచారణ చేస్తున్నారని, వారిని విడిచి పెట్టడం, విడిచి పెట్టకపోవడం అనే నిర్ణయం ఇంటిలిజెన్స్ వర్గాలు తీసుకుంటాయని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.