ప్లాస్టిక్ నిషేధానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి : నరేంద్ర మోడీ
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించాలన్న భారత నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి పునరుద్ఘాటించారు, "సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రపంచం కూడా వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది" ఆయన అన్నారు..డిల్లీలో జరిగిన ప్రపంచ వాతావరణ మార్పులు మరియు సంక్షోభం పై నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఈనేపథ్యంలోనే మానవ సాధికారత అనేది పర్యావరణంతో ముడిపడి ఉందని చెప్పారు. దేశంలో కల్గే వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి ప్రజలు ముందుకు వచ్చి, కలిసి పనిచేయాలని మోడీ పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబర్ 2 నాటికి ఆరు ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఆరు వస్తువులలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, చిన్న సీసాలు, స్ట్రాస్ మరియు కొన్ని రకాల సాచెట్లు ఉన్నాయి.ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించి కఠినమైన పర్యావరణ ప్రమాణాలను రూపోంచిందేకు కూడా ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు మరియు దీంతోపాటు రీసైకిల్ చేసి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువలను మాత్రమే ఉపయోగించేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు రూపోందించిందని చెప్పారు.

మరోవైపు ప్లాస్టిక్ కాలుష్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి, దీంతో పలు దేశాలు మహాసముద్రాలపై కూడ ప్రత్యేక దృష్టి సారించాయి, సముద్రాల్లో దాదాపు 50 శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు సముద్రంలో వేస్తున్నారు. దీంతో సముద్ర జీవులు చనిపోయోందుకు అవి దోహదపడుతున్నాయని సమావేశంలో పాల్గోన్న పలువురు వక్తలు తెలిపారు.ఇక ప్రపంచ దేశాల్లో యూరోపియన్ యూనియన్ 2021 నాటికి స్ట్రాస్, ఫోర్కులు, కత్తులు మరియు పత్తి మొగ్గలు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని యోచిస్తున్నట్టు పలువురు వెళ్లడించారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications