19 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి: స్పీకర్ కు ఫిర్యాదు చేసిన తమిళనాడు చీఫ్ విప్ !
పళనిసామికి వ్యతిరేకంగా ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు 19 మంది ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు గతంలో జరిగిన ఉదాహరణలు వివరించిన శాసన సభలో చీఫ్ విప్ రాజేంద్రన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఉపసంహరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్థిస్తున్న ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆరాష్ట్ర శాసన సభలో చీఫ్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద అసంతృప్తి ఉంటే శాసన సభలో చీఫ్ విప్ అయిన తనకు సమాచారం ఇచ్చి తన అనుమతితో గవర్నర్ ను కలవాలని నియమాలకు విరుద్దంగా 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిశారని, వారి మీద కఠినచర్యలు తీసుకోవాలని రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చేశారు.

గురువారం తమిళనాడు సచివాలయంలో స్పీకర్ ధనపాల్ తో తమిళనాడు ప్రభుత్వ చీఫ్ విప్ రాజేంద్రన్ కలిసి చర్చించారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వ చీఫ్ విప్ ఫిర్యాదు చేస్తే స్పీకర్ చర్యలు తీసుకున్న సందర్బాలను ఉదాహరణకుగా ధనపాల్ కు రాజేంద్రన్ వివరించారు.
దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చెయ్యడంతో స్పీకర్ ధనపాల్ ఎలా స్పంధిస్తారో అంటూ మన్నార్ గుడి మాఫియా వేచి చూస్తోంది. మరో వైపు ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవాలని సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం తెరవెనుక మంతనాలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications