దారుణం: వేడి వేడి పాలు మీద పడి చిన్నారి మృతి
న్యూఢిల్లీ: ఇంట్లో పసిపిల్లలుంటే అనునిత్యం వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి. ప్రతి క్షణం కూడా వారిపై ఓ కన్నేసి ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా మనం భారీ మాల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి.
చిన్న చిన్న పొరపాట్లే నిండు జీవితాన్ని బలితీసుకుంటుంది. తాజాగా అలాంటి దురదృష్టకర సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ చిన్నారి మీద వేడి వేడి పాలు పడటంతో ప్రాణాలు కోల్పోయింది.

ఈ సంఘటన అదివారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాలను వేడి చేసిన చిన్నారి తల్లి అవి చల్లబడేందుకు గాను హాలులో ఫ్యాన్ కింద ఉంచి వేరే పనిలో నిమగ్నమైంది. అయితే ఆ విషంయ తెలియని చిన్నారి ఆడుకుంటూ ఆ పాల గిన్నెను తనపై పోసుకుంది.
దీంతో చిన్నారి అరుపులు విన్న ఆ కన్న తల్లి హుటాహుటిన సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి శరీరం యాభై శాతం కాలిపోవడంతో చికిత్సకు సహకరించక మృత్యువాత పడింది. ఆ కుటుంబ సభ్యులే కాకుండా ఇరుగుపొరుగు వాళ్లు కూడా ఈ ఘటనను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.












Click it and Unblock the Notifications