Karnataka: బీజేపీకి పెద్ద సవాల్గా మారిన కొత్త సీఎం అన్వేషణ-సామాజిక సమీకరణాలపై ఎటూ తేల్చుకోలేక..!
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక విషయం బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. సామాజిక సమీకరణాలు,ఎమ్మెల్యేల అభిప్రాయాలు,నాయకత్వ సమర్థత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించనుంది. కొద్దిరోజుల్లోనే కొత్త సీఎంను ప్రకటిస్తారని యడియూరప్ప చెప్పినప్పటికీ...ఆ ప్రక్రియ అంత త్వరగా పూర్తయ్యేలా కనిపించట్లేదు. యడియూరప్ప తర్వాత పార్టీలో ఆ స్థాయి నేత మరొకరు లేకపోవడంతో... బీజేపీ తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది.
Recommended Video

ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకునేందుకు...
ఇదే అంశంపై చర్చించేందుకు కేంద్రమంత్రి అమిత్ షా సోమవారం(జులై 26) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఎంపిక కోసం కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్,కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను అబ్జర్వర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అబ్జర్వర్లు మంగళవారం(జులై 27) బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను కోరే అవకాశం ఉంది. ఆపై వారి అభిప్రాయాలను అధిష్ఠానానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.

సామాజిక సమీకరణాలపై ఎటూ తేల్చుకోలేక...
సామాజిక సమీకరణాలపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. లింగాయత్ వర్గానికే మరోసారి అవకాశం ఇవ్వాలా... లేక వేరే సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలా అన్న దానిపై సమాలోచనలు జరుపుతోంది. అయితే లింగాయత్ వర్గాన్ని పక్కనపెడితే... ఏళ్లుగా బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ ఆ వర్గం ఎక్కడ పార్టీకి దూరమవుతుందోనన్న టెన్షన్ కూడా వెంటాడుతోంది. అయినప్పటికీ కొత్త ప్రయోగాలకు తెరదీయకపోతే భవిష్యత్తులో బీజేపీ అధికారాన్ని నిలుపుకోలేదన్న భావన కూడా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఏ సామాజికవర్గానికి సీఎం పదవి కట్టబెట్టినా ఇతర వర్గాలు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉండటంతో నాలుగు ప్రధాన సామాజికవర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో లింగాయత్,దళిత్,వొక్కలిగ వర్గాల నుంచి ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అదనంగా కురబ సామాజికవర్గానికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది.

లింగాయత్ లేదా బ్రాహ్మణ..?
లింగాయత్ వర్గం నుంచి వెస్ట్ ధర్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్,విజయపురా ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యాత్నల్,మంత్రులు ముర్గేశ్ ఆర్ నీరణి,బసవరాజ్ బొమ్మై తదితరుల పేర్లు బీజేపీ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేర్లు సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ-షా ద్వయం ఈసారి ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకుంటారా లేక ప్రచారంలో ఉన్న పేర్లలో నుంచే ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications