ఘోర ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మంది మృతి.. 40 మందికి సీరియస్..
ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఆదివారం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న క్రమంలో ఈ దారుణం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారైకుడి సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్న ఘటనలో 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నిలిచిపోయాయి.


ఇక ప్రమాదంలో మృతి చెందిన 11 మందిలో 9 మంది మహిళలే ఉన్నారు. కారైకుడి సమీపంలో తిరుపత్తూరు ప్రాంతంలోని పిల్లయ్రర్ పట్టి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను బయటకు తీయడంతో పాటు.. బస్సుల్లో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి ముందు ఓ ఆర్టీసీ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకూడికు వెళ్తుండగా.. మరో ఆర్టీసీ బస్సు కారైకూడి నుంచి దిండిగల్ వైపునకు వెళ్తున్నట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications