ట్రాన్స్జెండర్ల మోసం.. ఇంట్లో శాపం ఉందంటూ బంగారం దోపిడి...!
ట్రాన్స్జెండర్ల పై సమాజంలో కొద్దో గోప్పో గౌరవం,సానూభూతి ఉంటుంది..అయితే ఆ సానుభూతిని ఆసరా చేసుకున్న కొంత మంది ట్రాన్స్జెండర్లు ఓ మహిళను నిట్టనిలువునా ముంచారు. కుటుంభానికి శాపం ఉందంటూ మహిళను నమ్మించారు.ఇందుకోసం పూజలు చేయాలని చెప్పారు. అనంతరం ఆమే వద్ద రెండు లక్షల విలువ చేసే బంగారాన్ని అపహరించారు
మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఓ మహిళ ఇంటికి ఇద్దరు ట్రాన్స్జెండర్లు చీరలు ధరించి వెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళతో ఆ ఇంటికి శాపం ఉందని, శాపం విముక్తి కలగాలంటే సాంప్రదాయం ప్రకారం పూజలు చేయాలని చెప్పారు. ఇందుకోసం బంగారం అవసరమవుతుందని చెప్పారు. దీంతో సదరు మహిళ ఇంట్లో ఉన్న బంగారాన్ని తెచ్చి ఇచ్చింది..అయితే అనంతరం నీళ్లు తీసుకురావాలని చెప్పారు..నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లడంతో బంగారంతో ఉడాయించారు..
మరోవైపు మరో నాలుగు రోజుల తర్వాత కూడ ఈ ట్రాన్స్జెండర్లే మరో ఇంట్లోకి చోరబడి ఇదే విధంగా మహిళను నమ్మించి సుమారు 75వేల రుపాయల బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. ఇలా నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనలకు పాల్పడిని ట్రాన్స్జెండర్లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.